కైకాల వెంకట సుమలత
పేరు కైకాల వెంకట సుమలత. నివాసం గుడివాడ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణా, స్వాతి, రవళి, సృజన క్రాంతి, సాహో, సాహితీ కిరణం, విశాఖసంస్కృతి, రమ్యభారతి మొదలగు పత్రికలలో రెండువందల యాభైకి పైగా సామాజిక కథలు, రెండు వందలకి పైగా కవితలు మరియు నూట యాభైకి పైగా బాలల కథలు ప్రచురించబడ్డాయి. వీటిలో అనేక కథలు బహుమతులకు నోచుకున్నాయి. సౌరభాలు* అనే కథల సంపుటి వెలువడింది. నవచేతన వారి నుండి 2024 నవంబర్ లో అభినందన 2025 మే నెలలో ఎమెస్కో వారి సాహితీ ప్రచురణల నుండి అసలైన బహుమతి అనే బాలల పుస్తకాలు వెలువడ్డాయి. ఆనందం హాసిస్తే అనే సామాజిక కథల సంపుటి, 2025 డిసెంబర్ నెలలో తపస్వి మనోహరం వారి నుండి హాస విలాసాలు అనే హాస్య కథల సంపుటి, 2026 ఏప్రిల్ లో మౌన రాగాలు అనే కవితా సంపుటి వెలువడ్డాయి
