మల్లిపురం జగదీశ్
మల్లిపురం జగదీశ్ గా రచనలు చేస్తున్న రచయిత పూర్తి పేరు మల్లిపురం జగదీశ్వర రావు. స్వస్థలంపార్వతీపురం మన్యం జిల్లాలో గల గుమ్మలక్ష్మీపురం మండలం లో “పి. ఆమిటి” అనే ఆదివాసీ గ్రామం. ఎం.ఏ (ఆంగ్లం), ఎం.ఏ (తెలుగు), బీ.ఈడీ విద్యార్హతలు. గిరిజన సంక్షేమ శాఖ లో గల కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఆంగ్ల సహోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు.
అనేక కథల పోటీలలో వివిధ బహుమతులతో పాటు రంగినేని ఎల్లమ్మ స్మారక కథా పురస్కారం, సిరిసిల్ల (2012), మాడభూషి రంగాచారి స్మారక సాహిత్య పురస్కారం, హైదరాబాదు (2013), విమలాశాంతి సాహిత్య కథా పురస్కారం, అనంతపురం (2013), గిడుగు సాహిత్య పురస్కారం, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ (2017), రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారం – 2024, ఉదయిని, హైదరాబాద్ మొదలైన అవార్డులు అందుకున్నారు.
