నవభారతం

Spread the love

నాగరిక నవ సమాజమంతా
అమృతోత్సవాలలో
మునిగి తేలుతుంటే
ఏడు పదులు దాటిన
స్వాతంత్ర్య భారతావని సాక్షిగా
పట్టపగలే పట్టపగ్గాలు లేని
మదకత్తులకు పూనకాలొచ్చి
నడిరోడ్డుపై ఆడబిడ్డల
కుత్తుకలు తెగ్గోస్తున్నా
నోరు విప్పని నరలోకం

అర్థరాత్రి ఆడది ఒంటరిగా
నడిరోడ్డుపై నడిచే రోజే నిజమైన
స్వతంత్ర్యం అన్న పెద్దల మాటకు
నిలువెత్తు సాక్ష్యాలు నేడు
పట్ట పగలే మానవారణ్యంలో
మారణహోమాలు....
మంట కలిసి పోతున్న
మానవతా విలువలు
మనిషిని మనిషే వేటాడే
మానవ మృగాల మధ్యలో
మనగలిగి ...
రక్త మాంసాలు పంచి
మరో జీవికి ప్రాణం పోసే
మాతృమూర్తికి మనం ఇచ్చే
బహుమతి
కన్నీటి జలపాతాలేగా....
డా: తాళ్ళపల్లి యాకమ్మ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *