ఆడియో కథ :
ఈకాలపు తెలుగు కథ పుస్తకం నుంచి ‘జాగరణ’
కథ. రచన: అజయ్ ప్రసాద్.

బి అజయ్ ప్రసాద్
బి అజయ్ ప్రసాద్ 52 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా నకరికల్లు లో 1972 జూన్ 9న జన్మించారు. దక్షిణ కోస్తాంధ్ర లోని గుంటూరు, మాచర్ల,అద్దంకి గుడ్లవల్లేరు వంటి నగరాలు, గ్రామాల్లో పెరిగారు. జీవిత సమరంలో అనేక ఆటుపోట్ల అనంతరం నిరుద్యోగిగా హైదరాబాదు మహానగరంలోనికి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్ గా జీవిక కొనసాగిస్తున్నారు. 2005లో వచ్చిన తన మొదటి కథ మరుభూమి తో రచయితగా గుర్తింపు పొందారు. ఇప్పటిదాకా 50 కి పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురించ బడ్డాయి. వాటిలో 30 కథల తో రెండు కథా సంపుటాలు 'లోయ, గాలి పొరలు' పేర్ల తో ముద్రించబడ్డాయి. కొన్ని కథలు హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో అనువదించబడ్డాయి. వీరి కథలు తమిళం లోకి అనువాదమయి 'అద్దంకి మలై' పుస్తకంగా వెలువడింది.
