మా నేల మీదకి వసంతం వచ్చింది.
ఎప్పటిలాగే తురాయిపూలు వికసించాయి.
కానీ చూడటానికే నాకు కళ్ళు లేవు.
పూల పుప్పొడి పాడయి
పడి వుండడం చూస్తున్నాను.
చలికాలం ఇంత చల్లదనాన్ని
శవపేటికలలో వదిలివెళ్తుందని
నాకు తెలీనే తెలీదు.
ఈ చపలపు చావుల వాసన
ప్రతిచోటా వ్యాపిస్తోంది.
కొన్నిసార్లు కవిత్వం పచ్చి అబద్ధం కావొచ్చు.
యుద్ధం ముంచుకొచ్చినపుడు
అందాలనీ,సౌందర్యాలనీ ఎలా చూడాలో
అది అంత ఎక్కువగా చెప్పదు.
నడవలో నేను
రాలుతున్న ఆకుల్ని చూడను.
తూటా గుండ్లతో పాటు గెంతుతాను.
పొద్దుతిరుగుడు, కలువలు
సుడాన్ జాతీయ పుష్పం..
దేన్నీ పట్టించుకోను.
యుద్దం వచ్చినప్పుడు
పూలను ఎలా ప్రేమించాలో
కవిత్వం నాకు సరిగా నేర్పించలేదు.
Moumita Alam
P. Srinivas Goud
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com
