నేను నిరంతర ముట్టడిలో వున్నాను.
నా నాలుక నుండి గొంతు దాక
కాలిగోరు దాక
అన్నీ ఆక్రమించారు.
తుపాకీలు ఊపుతూ
నన్ను చంపేస్తున్నారు.
ఒక పెద్ద తెల్లనోరు రాకాసి
నా గొంతు నొక్కి
" జరిగింది చాలు.
ఇప్పుడు నా వంతు" అని అరుస్తుంది.
ఈ ఇరవై యేళ్ళుగా అతని వంతులో
లక్షన్నర సార్లు అనేక విధాలుగా
అతను నన్ను నా పేరు మీదే వధించాడు.
కాళ్ళూచేతులు తెగిన భర్తలు
చనిపోయిన పిల్లలు
చిధ్రమయిన అవయవాలు
కుంటుతూ వున్న బతుకులు
గర్భంలో పిండం అలాగే వుంది.
వేస్తున్న ప్రతి బాంబు శబ్దానికి
అనాథ పిల్లలు
మళ్ళీ మళ్ళీ అనాథలవుతున్నారు.
Moumita Alam
P. Srinivas Goud
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com
